బాధిత కుటుంబానికి పూర్వ విద్యార్థులు 16వేల ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా :బాధిత కుటుంబానికి బండలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2004-05వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి 16 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య రేసు వనిత ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలారు.

 Alumni Will Provide Financial Assistance Of 16,000 To The Victim's Family , Fin-TeluguStop.com

చిన్ననాటి స్నేహితులు కలిసి జమ చేసిన నగదు మొత్తాన్ని ఆదివారం రేసు వనిత ఇంటికి చేరుకొని 16 వేల ఆర్థిక సహాయాన్ని వార్డు సభ్యులు సురేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube