మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింంది.రెండు రోజుల క్రితమే విల్లు, బాణం గుర్తును ఈ ఎన్నికల వరకు ఫ్రీజ్ చేసింది.
ఈసీకి మూడు ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లను ఉద్ధవ్ వర్గం సమర్పించింది.ఈ క్రమంలో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది.
అదేవిధంగా ఉద్ధవ్ వర్గం పార్టీకి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పేరు ఖరారు చేశారు.శివసేన పార్టీపై ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శివసేన పార్టీ గుర్తును ఎవరూ వాడకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చింది.







