గవర్నమెంట్ డాక్యుమెంట్ మూడు మూలాలనుండి వచ్చిన సమాచారం మేరకు నైపుణ్యం కలిగిన ఆటలను మాత్రమే నియంత్రించి, ఛాన్స్ గేమ్స్ ని పర్యవేక్షణ పరిధి నుండి తొలగించాలనే ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం తోసిపుచ్చిన తర్వాత, ఆన్లైన్ గేమింగ్పై భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అన్ని రియల్-మనీ గేమ్లకు వర్తిస్తుంది.
రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ అంచనా వేసిన ప్రకారం 2026 నాటికి $7 బిలియన్ల విలువ కలిగివుండే,భారతదేశ గేమింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయించే రియల్-మనీ గేమ్స్ యొక్క ఫ్యూచర్ ను షేప్ చేస్తునట్టు చాలాకాలంగా ఎదురుచూస్తున్న రెగ్యులేషన్స్ కనిపిస్తున్నాయి.
టైగర్ గ్లోబల్ మరియు సీక్వోయా క్యాపిటల్ ఇటీవలి సంవత్సరాలలో ఫాంటసీ క్రికెట్కు ప్రసిద్ధి చెందిన ఇండియన్ స్టార్టప్ డ్రీమ్11 మరియు మొబైల్ ప్రీమియర్ లీగ్లకు మద్దతునిచ్చాయి.
ఆగస్ట్లో నియంత్రణను రూపొందించే పనిలో ఉన్న భారతీయ ప్యానెల్ ఒక గేమ్లో నైపుణ్యం లేదా ఛాన్స్ ఉందా అని నిర్ణయించడానికి కొత్త బాడీని ప్రతిపాదించింది, ఆపై రిజిస్ట్రేషన్ రిక్వర్మెంట్స్ కె వై సి నిబంధనలు మరియు ఫిర్యాదుల కోసం ప్రణాళికాబద్ధమైన ఫెడరల్ నియమాల ప్రకారం స్కిల్ గేమ్స్గే నిర్వహించబడతాయి.
చాన్స్ గేమ్లు - గ్యాంబ్లింగ్ తో సమానంగా పరిగణించబడుతున్నాయి, ఇది చాలా వరకూ భారతదేశమంతటా నిషేధించబడ్డాయి వాటిని స్వేచ్ఛగా నియంత్రించే అధికారం కలిగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేలా సెట్ చేయబడ్డాయి,onlinecasinoguide.in.తెలిపిన ప్రకారం.
అయితే రాయిటర్స్ రివ్యూ ప్రకారం, అక్టోబర్ 26న జరిగిన ప్రభుత్వ సమావేశం యొక్క సీక్రెట్ మినిట్స్ ప్రకారం, అన్ని రకాల ఆటలపై విస్తృత పర్యవేక్షణ కోసం పిలుపునిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి చెందిన ఒక అధికారి అటువంటి భేదాన్ని వ్యతిరేకించారు.
చట్టపరమైన స్పష్టత లేకపోవడం మరియు విరుద్ధమైన కోర్టు నిర్ణయాల కారణంగా గేమ్లను నైపుణ్యం లేదా ఛాన్స్ గేమ్స్ గా గుర్తించడం అంత సులభం కాదు, "ఆన్లైన్ గేమింగ్ను ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒక యాక్టివిటీసర్వీస్ గా పరిగణించవచ్చు.అని అధికారిని ఉటంకిస్తూ, మినిట్స్ లో కోట్ చేయబడింది.
భారతదేశంలో ఆటలను డిఫైన్ చేయడం వివాదాస్పదమైంది.కార్డ్ గేమ్ రమ్మీ మరియు కొన్ని ఫాంటసీ గేమ్లు నైపుణ్యం ఆధారితమైనవి మరియు చట్టబద్ధమైనవి అని భారతదేశ సుప్రీం కోర్టు పేర్కొంది, ఉదాహరణకు, పోకర్ వంటి ఆటల గురించి వివిధ రాష్ట్ర న్యాయస్థానాలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయి.
వారి కామెంట్ కోసం చేసిన రిక్వెస్ట్ పై ప్రధానమంత్రి కార్యాలయం మరియు నిబంధనలను రూపొందిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.
న్యూఢిల్లీలోని ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా రూల్-మేకింగ్ ప్రాసెస్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్తో మాట్లాడుతూ, ఈ నియమాలు ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్కు అన్నిరకాల ఆటలపై విస్తృత పర్యవేక్షణను ఇస్తాయని, అయితే గ్యాంబ్లింగ్ లేదా ఛాన్స్ఆటలపై పూర్తిగా నిషేధం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా యువతలో ఇటువంటి గేమ్ల విస్తరణ వ్యసనం మరియు ఆర్థిక నష్టాలకు దారితీసిందని, కొన్ని ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయని పెరుగుతున్న ఆందోళనల మధ్య కొత్త నిబంధనల రూపకల్పన జరిగింది.
ఇటువంటి ప్లాట్ఫారమ్ల సంభావ్య వ్యసనం గురించి మోడీ అడ్మినిస్ట్రేషన్ ఆందోళన చెందుతోందని ప్రభుత్వ వర్గాలలో ఒకటి చెప్పింది.
ప్రభుత్వ ప్యానెల్ యొక్క ఆగస్టు నివేదిక ప్రకారం కొత్త నిబంధనలు డి-అడిక్షన్ చర్యలు అని పిలవబడే పిరియాడిక్ వార్ణింగ్స్ మరియు సలహాలు మరియు ఫిక్సింగ్ డిపాజిట్ మరియు ఉపసంహరణ పరిమితులను కలిగి ఉండాలని సిఫార్సు చేసింది.
Content Produced by: Indian Clicks, LLC
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy