స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.రామాయణం కావ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే.
ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) రావణాసుడిగా నటించారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా గత ఏడాది విడుదలైన టీజర్ కు విమర్శలు రావడంతో ఈ సినిమాను మరోసారి మార్పులు ఎట్టకేలకు ఈనెల అనగా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అంతేకాకుండా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చాలామంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.ఈ మూవీ ప్రీ రిలీజ్ డీల్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి.దీని ద్వారా ఇప్పటికే రూ.432 కోట్లను రికవరీ చేసినట్లు తెలుస్తోంది.దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆదిపురుష్ ( Adipurush )థియేట్రికల్ డీల్ లాక్ చేసేశారట మూవీ మేకర్స్.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ను మినిమమ్ గ్యారంటీ ప్రాతిపదికన జీఎస్టీ మినహా రూ.185 కోట్లకు కొనుగోలు చేసింది.అంటే సౌత్లో డిస్ట్రిబ్యూటర్ రికవరీ కోసం ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది.
ఇక అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, నాన్ థియేట్రికల్ వసూళ్లు రూ.242 కోట్లు.కాగా ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ వద్దే ఉన్నాయట.హిందీలో ఆదిపురుష్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ను కమీషన్ ప్రాతిపదికన AA ఫిల్మ్స్ చేస్తోంది.
ఇక ఇంటర్నేషనల్గా ఈ సినిమాను టీ సిరీస్ సొంతంగా విడుదల చేయనున్నారు.అయితే మొత్తం మీద్ ఆదిపురుష్ ఇప్పటి వరకు పొందిన రికవరీస్తో నిర్మాతలు సేఫ్గానే ఉన్నారు.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.