ప్రకాశం జిల్లా( Prakasam District ) పెద్ద దోర్నాల మండల కేంద్రంలో మూడంతస్థుల భవనం( Three-Storied Building ) ఒక్కసారిగా కుప్ప కూలింది.ఇవాళ వేకువజామున శ్రీశైలంకు వెళ్లే రహదారిలో వాసవి లాడ్జి( Vasavi Lodge ) కూలిపోయింది.
అయితే ప్రమాద సమయంలో ఎవరూ బిల్డింగ్ లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అలాగే బిల్డింగ్ కూలే సమయంలో స్థానికులు విద్యుత్ ను నిలిపివేశారు.లాడ్జి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో భవన నిర్మాణ కోసం పునాదులు లోతుగా తవ్వారు.ఈ క్రమంలోనే లాడ్జి పునాదులు వీక్ కావడంతో భవనం కుప్పకూలిందని తెలుస్తోంది.







