వివేక్ పోటీ చేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందా?

గులాబీ పార్టీ ఎవరికైతే గాలం వేసిందో ఆ నాయకుడి పైనే కాంగ్రెస్ గురి పెట్టింది.ఆ నాయకుడే జి.

వివేక్.కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మాజీ ఎంపీ అయిన వివేక్నే వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.పోటీ చేయాలని ఆయన మీద కూడా ఒత్తిడి వస్తోంది.

వివేక్ పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ నాయకులు నమ్మకంతో ఉన్నారు.వివేక్ కోసం గులాబీ పార్టీ గాలం వేసిన సంగతి తెలిసిందే.

ఆయన్ని లాగాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు.దీనిపై వివేక్ కూడా చాలా ఆలోచించి ఎందుకో గులాబీ పార్టీలోకి పోలేదు.

Advertisement

కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే అవుతారేమో.కెసీఆర్ కూడా తన పార్టీ నాయకులతో సమావేశం జరిపారు.

వరంగల్ జిల్లా నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరి గులాబీ పార్టీ తరపున ఎవరిని ఎంపిక చేస్తారో.

మూడు పార్టీల అభ్యర్థుల కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు