‘పటాస్‌’తో దిల్‌రాజు ఫుల్‌ హ్యాపీస్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా సంవత్సరాల తర్వాత కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు.

‘పటాస్‌’ సినిమాతో కళ్యాణ్‌ రామ్‌ ఇన్నాళ్ల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడిరది.

‘పటాస్‌’ సినిమా కళ్యాణ్‌ రామ్‌కు ఫుల్‌ హ్యాపీని ఇచ్చింది.హీరో మాత్రమే కాకుండా ఈ సినిమాను స్వయంగా నిర్మించిన కళ్యాణ్‌ రామ్‌ మంచి లాభాలను ఈ చిత్రంతో దక్కించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన నిర్మాత దిల్‌రాజు కూడా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.తాజాగా దిల్‌రాజు మాట్లాడుతూ.

‘పటాస్‌’ సినిమాను ఎన్టీఆర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘ఆది’ మరియు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాలతో పోల్చాడు.ఈ మూడు సినిమాలను దిల్‌రాజు పంపిణీ చేయడం జరిగింది.

Advertisement

దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌ ప్రారంభించిన దగ్గర నుండి కూడా కేవలం రెండు సినిమాలు మాత్రమే వారం రోజుల్లో లాభాలను తెచ్చి పెట్టాయట.అవే ‘ఆది’ మరియు ‘గబ్బర్‌సింగ్‌’.

ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు మళ్లీ ‘పటాస్‌’ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి పూడి లాభాలను తెచ్చి పెట్టిందని సంతోషంగా ఉన్నాడు.అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సరసన హీరోయిన్‌గా శృతి సోది నటించిన ఈ విషయం తెల్సిందే.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు