జగనన్న కు రాఖీ కట్టిన హీరోయిన్

గత రెండు సార్లు జైలు లో ఉండటం వల్ల రాఖీ పండుగ ను మిస్ అయిన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఈ సారి పండుగను తన ఇంట్లో ఘనం గా జరుపుకున్నారు .హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి.

 Actress Roja Ties Rakhi To Ys Jagan-TeluguStop.com

ఈ సందర్భంగా పలువురు మహిళలు, పిల్లలు జగన్‌కు రాఖీ కట్టారు.తనకు రాఖీలు కట్టిన అందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ఆర్ సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు

అయితే జగన్ కు ఆ పార్టీ మహిళా నేత, నగరి శాసన సభ్యురాలు,ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా రాఖీ కట్టడం పలువురిని ఆకర్షించింది .అతి త్వరలో రోజా జగన్ పార్టీ కు గుడ్ బై చెప్పనుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యం లో రోజా రాఖీ కట్టడం ద్వారా జగనన్న మీద ఉన్న ప్రేమను మరొకసారి చాటుకుందని ,రోజా పార్టీ అస్సలు వీడదని పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పుకొచ్చారు .ఈ సందర్భంగా రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్.

మరొకవైపు జగన్ సొంత చెల్లెలు ,ఆ పార్టీ మహిళా నేత షర్మిల ఎక్కడా కనిపించకపోవడం విశేషం .గత రెండు పర్యాయాలు షర్మిల జగన్ ను చంచల్ గూడా జైలు లో కలిసి రాఖీ కట్టారు .ఈ సారి షర్మిల ఫారిన్ లో ఉండటం వల్ల జగన్ కు రాఖీ కట్టలేకపోయారని కొంతమంది లీడర్ ల అభిప్రాయం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube