కుంభమేళ(kumbh mela) వైరల్ గర్ల్ మోనాలీసా మరోసారి వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం ఆమె “ది డైరీస్ ఆఫ్ మణిపూర్” (The Diaries of Manipur)చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాకి గాను ఆమె ట్రైనింగ్ తీసుకుంటూ బిజీగా ఉన్నారు.ఇటీవలే ఒక జువెల్లరీ షోరూంను ప్రారంభించిన ఆమె, ఫ్లైట్లో ప్రయాణించడంతో పాటు కుటుంబంతో కలిసి ఫైవ్స్టార్ హోటల్లో (five-star hotel)భోజనం చేశారు.అయితే, ప్రస్తుతం తన తల్లిని సర్ప్రైజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
“ది డైరీస్ ఆఫ్ మణిపూర్” సినిమాలో నటించేందుకు మోనాలీసా (monalisa )25 లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఆమెకు పలు బ్రాండ్స్ నుంచి అంబాసిడర్షిప్ ఆఫర్లు వచ్చాయి.తాజాగా తన తల్లి తనను చూసేందుకు వచ్చిన సందర్భంగా, మోనాలీసా తన మొదటి పారితోషికంతో ఒక<em గోల్డ్ చైన్(Gold Chain) కొనుగోలు చేసి, తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చారు.
అంతేకాదు, తన చేతుల్తో తల్లి మెడలో చైన్ వేసి సర్ప్రైజ్ చేశారు.ఈ అద్భుతమైన క్షణాలు నెటిజన్ల మనసును దోచుకున్నాయి.
ఇటీవల మోనాలీసాకు నేపాల్లో జరగనున్న శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.ఈ కారణంగా ఆమె మరింత ట్రెండింగ్ అవుతున్నారు.ఇది ఇలా ఉండగా.మోనాలీసా ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.దర్శకుడు సనోజ్ మిశ్రా వల్ల మోనాలీసా మోసపోతుందంటూ ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.అయితే, దీనిపై స్పందించిన మోనాలీసా “సనోజ్ మిశ్రా నన్ను తన కూతురిలా చూస్తాడు” అంటూ క్లారిటీ ఇచ్చారు.
మొత్తం మీద, మోనాలీసా ప్రస్తుత క్రేజ్, ఆమె తల్లికి ఇచ్చిన గిఫ్ట్, శివరాత్రి ఉత్సవాల ఆహ్వానం, వివాదంపై ఆమె రియాక్షన్ ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.