ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు వస్తుండడం కామన్ గా చూస్తూనే ఉంటాం.ఇక వేసవికాలం( Summer ) వచ్చిందంటే వైరల్ వీడియోలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.
ఇకపోతే వేసవి కాలంలో దేశవ్యాప్తంగా ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ రాష్ట్రం తీసుకున్న కనీసం 45 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
దీంతో దేశ ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.
ఇక మే నెలలో దక్షిణ భారతదేశంలో పాటు ఇతర భారత దేశంలో కూడా ఎండలు మరింత విపరీతంగా పెరిగాయి.ముఖ్యంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రాజస్థాన్ లో ఉండే ఎడారి ప్రాంతంలో వేడిగాలులు మండుతున్న ఎండల కారణంగా భారతీయ జవాన్లు( Indian Soldiers ) తీవ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ నిబద్ధమని తాజాగా ఓ జవాన్ అప్పడంతో చేసిన వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఎడారిలో ఓ అప్పడాన్ని( Papad ) ఎటువంటి ఆయిల్ లేకుండా కాల్చడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
తాజాగా మరో జవాన్ కోడిగుడ్డును( Egg ) ఇసుకలో పాతిపెట్టాడు.దాదాపు మూడు నిమిషాల పాటు ఆ కోడిగుడ్డును ఇసుకలో పాతి పెట్టగా అనంతరం దానిని తీసి చూడగా అది కాస్త ఉడికిపోయింది.దాంతో జవాన్ గుడ్డుపై ఉన్న తొక్క తీసి చూపించడం వీడియోలో కనపడుతుంది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం రాజస్థాన్ లో( Rajasthan ) ఎటువంటి ఎండలు ఉన్నాయో.
అయితే రాష్ట్రంలో తీవ్రమైన వేడి మధ్య సైనికులు ఆరోగ్యంగా ఫీట్ గా ఉండడానికి అధికారులు అనుసరిస్తున్న జాగ్రత్తలను అలాగే వివరాలను తెలుపుతూ బిఎస్ఎఫ్ సిబ్బంది చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ముఖ్యంగా ఎండ తాకిన నుంచి తప్పించుకునేందుకు తనకి నిమ్మకాయ నీరు, ఇతర ద్రవాలను తరచుగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాజస్థాన్ లో కొన్ని ప్రాంతాలు 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవడం తెలుస్తుంది.