ఇటలీలో( Italy ) ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.బిట్టో లోయలో ( Bitto Valley )ఇటీవల జరిగిన ఒక భయంకరమైన ప్రమాదంలో జిజ్లైన్ మౌతహిర్( Jizlaine Moutahir ) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.75 మైళ్ల వేగంతో వెళ్లే జిప్లైన్పై ప్రయాణిస్తున్నప్పుడు 60 అడుగుల ఎత్తు నుంచి జారిపడి ఆమె మరణించింది.జిప్లైన్ ద్వారా 750 అడుగుల ఎత్తులో బిట్టో లోయ అందమైన దృశ్యాలను ఆస్వాదించాలని మౌతహిర్ నిర్ణయించుకుంది.
ఈ ప్రయాణం 75 మైళ్ల వేగంతో ప్రారంభమై చివరికి నెమ్మదిగా ఆగేలా రూపొందించడం జరిగింది.

ప్రయాణం ముగియడానికి దగ్గరగా, మౌతహిర్ సేఫ్టీ హార్నెస్ విఫలమైంది, దీంతో ఆమె జారిపడింది.వైద్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తు ఆమెను అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించారు.జిప్లైన్ను నిర్వహించే సాహస క్రీడా సంస్థపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మౌతహిర్ మేనకోడళ్ళు, ముందుగానే ఈ జిప్లైన్పై ప్రయాణించారు, ఆమె ప్రయాణాన్ని చిత్రీకరిస్తూండగా ఈ ప్రమాదాన్ని చూశారు.ఫ్లై ఎమోషన్ (జిప్లైన్ను నిర్వహించే సంస్థ) సీఈఓ మాట్టెయో సంగుయినెటి( CEO Matteo Sanguinetti ) ఈ ఘటనపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మౌతహిర్ ఫ్రాన్స్కు చెందిన 55 ఏళ్ల మహిళ.ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఒంటరిగా ప్రయాణిస్తోంది.ఫ్లై ఎమోషన్ సంస్థకు ఇలాంటి ప్రమాదాలు కొత్తేం కాదు గతంలోనూ జరిగాయి.ఫ్లై ఎమోషన్ సీఈఓ సంగుయినెటి మౌతహిర్ కుటుంబానికి సంతాపం తెలిపారు.జరుగుతున్న న్యాయ విచారణలో సంస్థ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత సంస్థ జిప్లైన్ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.







