విజయనగరం జిల్లా గణపతినగరం టీడీపీలో ట్విస్ట్..!

విజయనగరం జిల్లా గణపతినగరం నియోజకవర్గ టీడీపీలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ ఒక్కటయ్యారు.

 Twist In Ganapatinagaram Tdp Of Vizianagaram District..! ,ganapatinagaram, Tdp,-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టీడీపీ( TDP ) నుంచి టికెట్ తమకి దక్కకపోవడంతో ఇరువురు నేతలు ఐదేళ్ల వైరాన్ని వీడి కలిసిపోయారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటైంది.

కాగా ఐదేళ్లుగా రెండు వర్గాలుగా ఉంటూ పార్టీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటాపోటీగా తలపడిన సంగతి తెలిసిందే.వీరిద్దరికీ కాకుండా కొండపల్లి శ్రీనివాసరావుకి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు.ఈ క్రమంలోనే కొండపల్లి శ్రీనివాసరావు( Srinivas Kondapalli )కు టికెట్ ఇవ్వడంపై గత కొంత కాలంగా కేఏ నాయుడు వర్గీయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.తనకి కాకున్నా కరణం శివరామకృష్ణ( Karanam SivaramaKrishna )కు అయినా టికెట్ ఇవ్వాలని త్వరలో అధిష్టానాన్ని కలవాలని కేఏ నాయుడు భావిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube