కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైంది..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని ఆరోపించారు.

 Telangana Was Under Detention During Kcr's Rule..: Cm Revanth Reddy-TeluguStop.com

అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారన్నారు.ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛ కోరుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని చెప్పారు.

ధర్నా చౌక్ వద్దన్న వారికి కూడా అక్కడ నిరసన తెలిపే అవకాశం ఇచ్చామన్నారు.కేసీఆర్ నయా నిజాంలా వ్యవహారించారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ కు గుర్తుగా టీఎస్ ను తెచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడలనే చాటారని పేర్కొన్నారు.జయ జయహే తెలంగాణకు మన ప్రభుత్వం గౌరవం ఇచ్చిందన్నారు.

టీఎస్ ను టీజీగా మార్చుకున్నామన్నారు.అంతేకాకుండా కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube