ఏపీలో విభజన హామీలు అమలు కాలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) అన్నారు.ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిదని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాపై పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ ఏనాడైనా మాట్లాడిందా అని ప్రశ్నించారు.

హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేదని విమర్శించారు. సీఎం జగన్( CM jagan ), టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) బీజేపీతోనే ఉన్నారన్న షర్మిల వారి ముగ్గురికి ఓటు వేసిన బీజేపీకి వేసినట్లేనని తెలిపారు.అయితే హోదా కోసం ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని వెల్లడించారు.







