జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు( Pawan Kalyan ) కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) మరో లేఖ రాశారు.జనసేన మేలు కోరి ఇచ్చే సలహాలు పవన్ కు నచ్చినట్లు లేవన్నారు.
పవన్ కు, తనకు మధ్య గొడవ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసి చంద్రబాబుకు దాసోహం అనేలా చేయాలని కొందరు భావిస్తున్నారని ఆరోపించారు.
జనసేనకు రాష్ట్రంలో మొత్తం 40 బలమైన స్థానాలున్నాయన్న హరిరామ జోగయ్య 24 నియోజకవర్గ స్థానాలను తీసుకుని చంద్రబాబును శాసించగలరా అని ప్రశ్నించారు.
తానేప్పుడూ జనసేన ( Janasena )మేలు కోరుకుంటానని చెప్పారు.పవన్ సీఎం కావాలని కాపు, బీసీ, ఎస్టీ, ఎస్సీలు కోరుకుంటున్నారని తెలిపారు.ప్యాకేజీ వీరుడంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ( Chandrababu )మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మిత్రులు ఎవరో.శత్రువులు ఎవరో పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.
పవన్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు.