మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంది.శివసేన పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు వచ్చింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకల్ తీర్పును ప్రకటిస్తున్నారు.
ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా స్పీకర్ రాహుల్ నార్వేకల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని తెలిపారు.అయితే గత సంవత్సరం ఉద్ధవ్ థాక్రే వర్గంపై షిండే తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.
తరువాత ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్ధతు ప్రకటించడంతో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.దీంతో షిండే సీఎంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో షిండే సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాక్రే వర్గం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.అలాగు తమదే నిజమైన శివసేన అని చెబుతూ షిండే వర్గం కూడా కంప్లైంట్ చేసింది.
రెండు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ నిర్ణయంపై ఇవాళ తుది గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే.







