ఏపీలో అర్హత ఉండి పథకాలు అందని లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసింది.ఈ మేరకు సుమారు 68,990 మంది లబ్ధిదారులకు రూ.98 కోట్లు నిధులను విడుదల చేశామని సీఎం జగన్ తెలిపారు.
పలు పథకాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రజలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలిపారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ నిధుల విడుదల ఉంటుందని చెప్పారు.కొత్తగా 1.17 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.అలాగే 1.11 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు, కొత్తగా 30 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని వెల్లడించారు.







