దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కల్లోలం సృష్టిస్తుంది.రోజు రోజుకు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 655 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కాటుకు ఒకరు బలయ్యారని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.అలాగే దేశంలో ప్రస్తుతం 3,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేరళలో 424 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతిచెందారు.తెలంగాణలో 12 కేసులు, ఏపీలో ఆరు కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు.
తమిళనాడులో 21, కర్ణాటకలో 104 కొత్త కేసులు నమోదు అయ్యాయి.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.