నల్లగొండ జిల్లా: అన్నదమ్ముల ఏర్పడిన ఓ భూ వివాదంలో తల దూర్చి అత్యుత్సాహం చూపించి ఒక గిరిజన వ్యక్తి చావుకు కారణమైన నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డిని సోమవారం ఐజిపి ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ వివాదాలు,సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని,ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు.







