తెలంగాణ ప్రజలది విలక్షణ తీర్పు..: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో విజయంపై మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని తెలిపారు.

 Telangana People Have A Unique Judgment..: Revanth Reddy-TeluguStop.com

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతా చారికి ఘన నివాళి ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్న ఆయన రాష్ట్రంలో అమరవీరులకు ఈ విజయం అంకితమని తెలిపారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి ప్రజలు తమకు అవకాశం కల్పించారన్నారు.ఇకపై ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామన్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుందని చెప్పారు.అన్ని వర్గాలు స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకోవడానికి కాంగ్రెస్ ఆలంబనగా ఉంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube