మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంటుంది.ఓటు వేసేందుకు చాలా మంది విముఖత చూపిస్తుంటారు.
తద్వారా 60 శాతానికి అటూ ఇటూగా చాలా చోట్ల ఓటింగ్( Voting ) నమోదు అవుతుంటుంది.సెలబ్రెటీల ద్వారా ఓటింగ్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎన్నికల కమిషన్ చాలా సందర్బాల్లో ప్రచారం చేయిస్తుంటుంది.
కొందరు వ్యక్తులు కూడా ఓటు ప్రాముఖ్యతను ఇతరులకు వివరిస్తుంటారు.ఓటు వేసే వారిని గౌరవిస్తుంటారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో( Madhya Pradesh ) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.శుక్రవారం పోలింగ్ జరిగింది.
ఇలా ఓటు వేయడానికి వచ్చిన వారికి ఓ స్వీట్ షాపు యజమాని తన వంతు ఉదారత చాటుకున్నారు.తన షాపులో ఓటర్లకు ఉచితంగా పోహా, స్వీట్లు పంపిణీ చేశారు.
తన మంచి మనసు చాటుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్( Indore ) ఒకటి.ఈ నగరంలో ప్రసిద్ధ చాట్-చౌపటీ “56 షాప్” దుకాణదారులు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న ఓటింగ్ మధ్య, తన ఓటు వేసిన ప్రతి వ్యక్తికి ఈ చాట్-చౌపట్టిలో( Chat-Chowpatty ) పోహా-జిలేబీ ఉచిత అల్పాహారం అందించారు.ఉచితంగా పోహా-జిలేబీ పొందడానికి, ఓటర్లు తమ వేలిపై చెరగని సిరా గుర్తును చూపించాలి.
ఇండోర్లో శుక్రవారం ఉదయం 9 గంటల లోపు ఓటు వేసిన ప్రజలకు ఉచిత పోహా మరియు జిలేబీ పంపిణీ చేశారు.ఉచితంగా ఇలా పోహా, జిలేబీ( Poha Jilebi ) పంపిణీ చేసిన మధురం స్వీట్స్ యజమాని శ్యామ్ శర్మ( Shyam Sharma ) మీడియాతో మాట్లాడారు.“100% పోలింగ్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను, అదే స్ఫూర్తితో, మేము ఉదయం 6 నుండి 9:30 వరకు ప్రజలకు పోహా, జిలేబీని ఏర్పాటు చేశాము.అందరూ తమ వేళ్లపై సిరా చూపించారు.
వారు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు” అని పేర్కొన్నారు.ఇలా ఓటర్లకు తన వంతుగా అల్పాహారం అందించారాయన.
దీంతో శ్యామ్ శర్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.