సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలో 154 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా 30 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 124 నామినేషన్లు అర్హత కలిగి ఉండగా అందులో బుధవారం జరిగిన ఉపసంహరణలో మరో 32 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ ( S Venkat rao )తెలిపారు.
దీనితో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు.హుజూర్ నగర్ -11,కోదాడ-2, సూర్యాపేట -12, తుంగతుర్తి -7 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
త్వరలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు గుర్తులను కేటాయిస్తామని, అభ్యర్థులు ప్రచారం సమయంలో ఎన్నికల నిబంధనలు( Election Rules తప్పక పాటిస్తూ సహకరించాలని, జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు.