టీడీపీ నేత కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మద్యం కేసులో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.అయితే టీడీపీ హయాంలో మద్యం కంపెనీలకు చట్ట విరుద్దంగా అనుమతి ఇచ్చారని కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అధికారులు ఏ2గా పేర్కొంది.







