ఖమ్మంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి పేరుతో లేఖ.. తీవ్ర కలకలం

ఖమ్మంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పేరుతో ఉన్న ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది.మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ పేరుతో లేఖ విడుదలైందని తెలుస్తోంది.

 A Letter In The Name Of A Member Of The Central Committee Of The Maoist Party In-TeluguStop.com

కార్పొరేట్ ఏజెంట్లకు ప్రధాన పార్టీలు సీట్లు ఇస్తున్నాయని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ లేఖలో పేర్కొన్నారు.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పొరేట్ రాజకీయ నాయకులేనని లేఖలో తెలిపారని సమాచారం.

ఈ క్రమంలో వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆజాద్ తెలిపారు.

పార్టీకి సేవ చేసిన వారికి కాకుండా తన అనుచరులకు సీట్లు ఇప్పించేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి లేఖ రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube