జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్ పై మాట్లాడతానన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తరువాతనే రాజు ఎవరో, మంత్రి ఎవరో తెలుస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ క్రమంలోనే పొత్తులపై సమన్వయం కోసం ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అయింది.బీజేపీ ఆశీస్సులతో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణంగా మద్ధతు తెలపాలని జనసేనాని కోరారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పొత్తుల అంశాన్ని త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు.తాము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నామన్న పవన్ పొత్తు అంశాన్ని వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
మరో ఆరు నెలల్లో జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా మరోసారి ప్రధానిగా మోదీని చూడాలని ఉందన్న పవన్ జనసేన నుంచి గెలిచిన ఎంపీలు అంతా ఎన్డీఏకు సపోర్ట్ గా ఉంటారని స్పష్టం చేశారు.