కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో అట్లీ కుమార్( Atlee Kumar ) ఒకరు.ఈయన పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగి పోతుంది.
ఇప్పటికే ఈయన తమిళ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ పైనే ఇప్పుడు అందరి కన్ను పడింది.
అందుకు కారణం ఏంటో అందరికి తెలుసు.ఈయన తెరకెక్కించిన జవాన్ సినిమాతో ఇప్పుడు అట్లీ హాట్ టాపిక్ అయ్యాడు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )తో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”జవాన్”..( Jawan Movie )ఈ సినిమా మొన్న సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి సంచలనాలు క్రియేట్ చేస్తూ పోతుంది.ఈ సినిమా చుసిన తర్వాత అట్లీతో సినిమా చేయాలనీ స్టార్ హీరోలు క్యూ కడుతున్నాడు.
పక్కా మాస్ సినిమాలు తీయడంలో అలాగే భారీ విజయాలు అందుకోవడంలో అట్లీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది.
అందుకే అట్లీ ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు అనే దానిపై అందరి ద్రుష్టి పడింది.అయితే అట్లీ ఎప్పటి నుండో టాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.కానీ కుదరడం లేదు.
ముఖ్యంగా ఎన్టీఆర్( NTR ) తో సినిమా చేయాలని అట్లీ ఉత్సాహంగా ఉన్నారు.ఎప్పుడో ఈ కాంబో సెట్ అవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుందిప్రజెంట్ అట్లీ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని కొన్ని రూమర్స్ వస్తుంటే జవాన్ కు సీక్వెల్ చేస్తాడు అని మరికొన్ని రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరి ముందు నుండి అంటున్నట్టుగా ఎన్టీఆర్ తో అట్లీ సినిమా ఉంటుందా? లేదంటే షారుఖ్ ఖాన్ తోనే మళ్ళీ జవాన్ సీక్వెల్ ఉంటుందా ? అనేది తెలియాల్సి ఉంది.