తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఎక్స్‎ప్రెస్‎కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం జరిగింది.

 Telangana Express Narrowly Missed A Big Accident-TeluguStop.com

ఉదయం ఎక్స్‎ప్రెస్‎లోని ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలను గమనించి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎక్స్‎ప్రెస్‎ ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలో నిలిపివేశారు.దీంతో వెంటనే ప్రయాణికులు బోగి దిగి బయటకు పరుగులు పెట్టారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

కాగా ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube