పవన్ ఆరోపణలు నిరాధారం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ లు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విశాఖ వారాహి యాత్రలో వైసీపీ పై అనేక ఆరోపణలు చేయడం తెలిసిందే.రుషికొండ పై( Rushi Konda ) అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 Pawan Allegations Are Baseless Former Minister Avanti Srinivas Counters Details,-TeluguStop.com

ఇదే సమయంలో భీమిలిలో ప్రభుత్వ భూములను దోచేసి రియల్ ఎస్టేట్ కు అమ్మేస్తున్నట్లు నేడు ఆరోపణలు చేయడం జరిగింది.దీంతో భీమిలి ప్రభుత్వ భూములపై పవన్ చేసినా ఆరోపణలు నిరాధారమని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్( Avanti Srinivas ) కౌంటర్లు ఇచ్చారు.

ఒక్క గజమైన ఆక్రమించినట్లు రుజువు చేస్తే.దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

రుషికొండ దగ్గర పర్యాటకశాఖ నిర్మిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ పై పవన్ చేసినా ఆరోపణలలో వాస్తవం లేదని ఖండించారు.ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలైన అక్కడి నుండి సాగించవచ్చని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

బుధవారం నాడు విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పవన్ పరిశీలించడం జరిగింది.ఎర్రమట్టి దిబ్బల గురించి స్థానిక జనసేన నేత సందీప్ పవన్ కళ్యాణ్ కి వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం.కేంద్ర పర్యావరణ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేయడం జరిగింది.

టూరిజం ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని పవన్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube