తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది.ఈనెల 19 వ తేదీన కేసీఆర్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాయిదా వేశారని తెలుస్తోంది.
అయితే భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తిరిగి ఈనెల 23న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.







