రేపు చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పుంగనూరు పర్యటన రణరంగంగా మారింది.చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Ycp Has Called For A Bandh In Chittoor District Tomorrow Details, Ycp, Pungunuru-TeluguStop.com

ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు ఇంకా పోలీసులకు మధ్య వాగ్వాదం జరగటంతో ఒక్కసారిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.ఈ దాడులలో పోలీసుల వాహనం కూడా ధ్వంసమైంది.

చంద్రబాబు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది.ఇదిలా ఉంటే పుంగునూరు ఘటనపై( Pungunuru ) వైసీపీ మండిపడింది.

రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ హింసాత్మక వైఖరికి నిరసన అంటూ శనివారం చిత్తూరు జిల్లా బంద్ కి( Chittoor Bandh ) వైసీపీ పిలుపు ఇచ్చింది.

పుంగునూరులో హింసకు కారణం తెలుగుదేశం పార్టీ అని అధికార పార్టీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.పుంగునూరు ఘర్షణలకు సంబంధించి మొదటి ముద్దాయిగా చంద్రబాబుని చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో టీడీపీ నాయకులు వైసీపీపై మండిపడుతున్నారు.అధికార మదంతో వైసీపీ నాయకులే దాడులకు పాల్పడ్డారని.

సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube