పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం( Bro movie ) రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వ్వబోతుంది.అభిమానులు ఈ చిత్రం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు, ‘భీమ్లా నాయక్’ సినిమా( Bheemla Nayak ) తర్వాత సుమారుగా ఏడాది తర్వాత రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూసేందుకు ఎంతో ఆత్రంగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సిఎంఅకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.తెలంగాణ ప్రాంతం లో వరదలు ముంచి ఎత్తుతున్నా కూడా ఈ సినిమాకి హైదరాబాద్ లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ సినిమాకి 6 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.వరదలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో మనం రోజు వార్తల్లో వింటూనే ఉన్నాము.
ఇక పోతే ఈ సినిమాకి ‘బుక్ మై షో’ అనే టికెట్ బుకింగ్ యాప్ లో గంటకి 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుండడం విశేషం.ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి తక్కువ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాకి ఈ స్థాయి బుకింగ్స్ జరగడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి ప్రతీక అని అందరూ అంటున్నారు.ఇదే రేంజ్ ఊపు లో రేపు పొరపాటున పాజిటివ్ టాక్ వస్తే కేవలం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు.ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ వసూళ్లు కాకపోయినా ఉన్న పరిస్థితులకు మంచి ఓపెనింగ్ వచ్చింది అనే చెప్పాలి.
కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు, లాంగ్ రన్ చాలా బలంగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన ఇన్ సైడ్ టాక్ ని ఒక్కసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఇందులో పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ని చాలా కాలం తర్వాత బయటకి తీసాడని, ఫకీర్స్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండగా , సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషన్స్ తో లాగించేశారని అంటున్నారు.ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మాత్రమే చేసిన చిత్రం అని, అత్తారింటికి దారేది సినిమా( Attarintiki Daredi ) తర్వాత మళ్ళీ ఈ చిత్రానికి అలాంటి లాంగ్ రన్ చూస్తామని అంటున్నారు.మరికొద్దీ గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రారంభం కానున్నాయి.
మరి ఈ షోస్ నుండి ఇప్పటి వరకు మనం విన్న టాక్ వస్తుందో లేదో చూడాలి.