ఆర్బీఐ (బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో 3 బ్యాంకులకు భారీ జరిమానా విధించి షాక్ ఇచ్చింది.
నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏ ఏ బ్యాంకులకు ఝలక్ ఇచ్చిందో, ఎంత మొత్తాన్ని పెనాల్టీగా విధించిందో ఒకసారి చూస్తే, వీటిల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, డోంబివ్లీ నగరి సహకారి బ్యాంక్ అనేవి ఉన్నాయి.
ఈ బ్యాంకులు రూల్స్ బ్రేక్ చేయడం వల్ల భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో డోంబివ్లీ నగరి సహకారి బ్యాంక్కు( Dombivli Nagari Sahakari Bank ) రూ.50 లక్షల జరిమానా విధించగా ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు( Andhra Pradesh Mahesh Co-operative Urban Bank ) రూ.65 లక్షల పెనాల్టీ, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్కు( Urban Co-operative Bank ) రూ.6 లక్షల జరిమానా విధించింది.ఆంధ్ర ప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్, డోంబివ్లీ నగరి సహకారి బ్యాంకులు రెండూ కొన్నింటిని సరిగ్గా అమలు చేయడంలో విఫలం కావడంతో సైబర్ సెక్యూరిటీ సమస్యలు అనేవి తలెత్తాయి.
అందుకే ఆర్బీఐ ఈ బ్యాంకులపై పెద్ద మొత్తంలోనే జరిమానా విధించినట్టు తెలుస్తోంది.మరోవైపున అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ విషయానికి వస్తే.కస్టమర్ల నుంచి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకోవడంలో బ్యాంక్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ బ్యాంక్కు జరిమానా వేసింది.

అంతేకాకుండా కస్టమర్ ఐడెంటిఫికేషన్కు సంబంధించి బ్యాంక్ తగిన రూల్స్ను పాటించకపోవడం వంటి కారణాలను కూడా ఆర్బీఐ( RBI ) తెలిపింది.కస్టమర్ లోకల్ అడ్రస్ ధ్రువీకరించుకోకుండానే అకౌంట్లో ట్రాన్సాక్షన్లు నిర్వహించడం, చెక్ బుక్స్కు సంబంధించిన నిబంధనలను బ్యాంక్ సరిగా అనుసరించకపోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంది ఆర్బీఐ.ఆర్బీఐ ఈ మూడు బ్యాంకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, ఎందుకు పెనాల్టీ విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ కోరింది.
బ్యాంకుల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.







