టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.
వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిన వచ్చిన విషయం విదితమే.రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.
వెర్సటైల్ నటి శ్రీయా రెడ్డి ఈ సినిమాలో భాగం అయినట్టు తెలిపారు.విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీ శ్రీయ రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
అయితే ఈ భామ ఓజి( OG Movie ) కంటే ముందుగానే సలార్ సినిమాలో( Salaar ) నటిస్తున్నట్టు ప్రకటన వచ్చింది.కాగా ఇప్పుడు పవన్ ఓజిలో కూడా భాగం అయ్యింది.

ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమా షూట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఓజి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం విదితమే.మరి తాజాగా ఈమె మరోసారి ఈ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కథ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని సుజిత్ అద్భుతమైన కథ తన రోల్ ను డిజైన్ చేసాడని.ఈ కథ విన్న 5 నిముషాల్లోనే నేను ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది.

మరి తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఈ సినిమా కోసం మాట్లాడుతూ.ప్రస్తుతం సలార్ తప్ప మరో సినిమా ఏది కమిట్ అవ్వకూడదు అని అనుకున్న అని కానీ ఓజి కంటెంట్ ఒప్పుకునేలా చేసిందని శ్రీయ చెప్పుకొచ్చింది.దీనిని బట్టి ఈ కథ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అర్ధం అవుతుంది.
కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







