మరో యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు... అస్సలు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా మహేష్ బాబు వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా మరోవైపు ఈయన వరుస కమర్షియల్ యాడ్స్( Commericial Adds ) చేస్తూ కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు తాజాగా మరొక యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.మహేష్ బాబు తాజాగా ఒక మొబైల్ ఫోన్ ( Mobile Phone ) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఒక వైపు సినిమా షూటింగులలో నటిస్తూనే మరోవైపు ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ ఈనెల 10వ తేదీ పూర్తి కానుందని సమాచారం.ఇలా ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ బాబు ఈ యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారనే చెప్పాలి.

ఇలా ఇప్పటికే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా మొబైల్ ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన భార్య నమ్రత ( Namrata ) కూతురు సితార ( Sitara ) ఇద్దరు కలిసి ఒక యాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.అదే విధంగా సితార సైతం ప్రముఖ జువెలరీ ( Jewellery ) సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు.ఇలా ఫ్యామిలీ మొత్తం భారీగా యాడ్స్ ఇస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెకేకుతున్న గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు