తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర అప్పు పెట్టారని షర్మిల విమర్శించారు.
రైతు రుణమాఫీ చేసేందుకు కూడా డబ్బులు లేవన్నారు.అవినీతి సొమ్ము అంతా కేసీఆర్ దగ్గరే ఉందన్న షర్మిల ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ తుంగలో తొక్కారని మండిపడ్డారు.
తెలంగాణలో మహిళలకు కూడా రక్షణ లేదన్నారు.అనంతరం పొత్తు అంశంపై మాట్లాడిన ఆమె కేసీఆర్ తో ఎన్నటికీ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు.