ప్రియమణి( Priyamani ).ఒకప్పుడు తెలుగు తెరపై వరుస చిత్రాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇలా తెలుగు తమిళ భాషలలో సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లి తెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇలా వరుస షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాలను తెలిపారు.
హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.అయితే అంతకంటే ముందుగా ఈమె షారుఖ్ ( Shahrukh Khan ),దీపికా ( Deepika Padukone ) కలిసి నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ ( ChennaExpress )చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో ఈమె చేసిన 1234 పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సాంగ్ కోసం ఐదు రాత్రులకు పైగా షూటింగ్ జరిగిందని ప్రియమణి తెలిపారు.అలాగే ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షారుఖ్ తాను కలిసి ఐప్యాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చూశామని తెలిపారు.
కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చూస్తున్న సమయంలో షారుఖ్ తన వద్ద ఉన్న 300 రూపాయలు తనకు ఇచ్చాడనీ ప్రియమణి తెలిపారు.అయితే ఆ 300 లు ఇప్పటికీ నావద్ద అలానే ఉంది అంటూ ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.షారుఖ్ చాలా లవ్లీ యాక్టర్ అని.షూటింగ్ సమయంలో తన చుట్టూ ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉండేలా చూస్తుంటారని ప్రియమణి షారుఖ్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తాజాగా నాగ చైతన్య( Nagachaitanya ) నటించిన కస్టడీ సినిమా( Custody Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.