మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది.ఈ గ్రహం శక్తివంతమైన రంగులు, అల్లకల్లోలమైన తుఫానులు, అపారమైన పరిమాణంతో శాస్త్రవేత్తలను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది.
దాని ప్రత్యేక లక్షణాలలో దాని భూమధ్యరేఖ చుట్టూ ఎప్పుడూ మారుతున్న రంగురంగుల చారలు కూడా ఉన్నాయి.కొన్నేళ్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ రంగులు మారడానికి గల కారణాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఎట్టకేలకు దీని వెనక గల కారణాన్ని వారు కనుగొన్నారు.

నాసా( NASA ) జూనో వ్యోమనౌక నుంచి డేటాను ఉపయోగించి, లీడ్స్ యూనివర్సిటీ సైంటిస్టులు బృహస్పతిపై ( Jupiter )మారుతున్న చారలు గురించి అర్థం చేసుకున్నారు.బృహస్పతిపై చారలు మారడం బహుశా దాని అయస్కాంత క్షేత్రంలోని తరంగాల వల్ల సంభవించి ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ తరంగాలు గ్రహం లోపల, దాని ఉపరితలం క్రింద 50 కిలోమీటర్ల లోతులో ఉద్భవించాయి.
అయస్కాంత క్షేత్ర తరంగాలు బృహస్పతి భూమధ్యరేఖ చుట్టూ కనిపించే బెల్ట్ల రంగుల నమూనాలను ప్రభావితం చేస్తాయని డేటా ప్రకారం శాస్త్రవేత్తలు తెలిపారు.

అనేక సంవత్సరాలుగా అయస్కాంత క్షేత్ర మార్పులను అధ్యయనం చేయడం ద్వారా, పరిశోధకులు తరంగాలను ట్రాక్ చేసారు.ఈ క్రమంలో గ్రేట్ బ్లూ స్పాట్ అని పిలిచే ఒక నిర్దిష్ట స్థలాన్ని గుర్తించారు.ఇది క్రమంగా తూర్పు వైపు కదులుతోంది.
బృహస్పతి బెల్ట్లలో మారుతున్న రంగులు దాని వాతావరణ పరిస్థితులలో మార్పులను కూడా ప్రతిబింబిస్తాయి.ప్రతి 4-5 ఏళ్లకు గ్రహం ప్రతికూల ప్రభావానికి గురవుతుంది.
ఇక్కడ వాతావరణ నమూనా కొద్దిగా అస్తవ్యస్తంగా మారుతుంది.ఈ అయస్కాంత క్షేత్ర తరంగాలను అర్థం చేసుకోవడం బృహస్పతి వాతావరణ డైనమిక్స్ను వివరించడంలో సహాయపడటమే కాకుండా దానిలో దాగివున్న అనేక విషయాలను అందిస్తుంది.







