టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పి పుచ్చడానికే సిట్ దర్యాప్తు అంటూ మభ్య పెడుతున్నారన్నారు.సిట్ విచారణ కూడా ప్రగతిభవన్ నుంచి జరుగుతుందని ఆరోపించారు.
రాష్ట్రంలో డిజిటల్ బాధ్యత అంతా ఐటీ శాఖదేనన్నారు.కానీ మంత్రి కేటీఆర్ సంబంధమే లేదన్నట్లు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.







