ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన నేత కాదని తెలిపారు.
జగన్ పాలనలో రాష్ట్రం దివాళా తీసింది.ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు.
ప్రతిపక్షాలు నోరెత్తకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులను అడ్డు పెట్టుకొని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని వేధింపులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్థికంగా దెబ్బతీసే గుణం రాజారెడ్డి నుంచి జగన్ కు వచ్చిందన్నారు.ఈ క్రమంలో సీఎం జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.







