ఖమ్మం జిల్లా బోనకల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నాకు దిగారు.ఈనెల 20 వ తేదీని శ్రీకాంత్ అనే యువకుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే పీఎస్ ఎదుట బైటాయించిన ఎమ్మార్పీఎస్ నేతలు బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో బోనకల్ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది.







