గత కొన్ని రోజుల నుండి నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక( Niharika ) బాగా వార్తలల్లో నిలుస్తుంది.కారణమేంటంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుందని.
ఇప్పుడొచ్చి పుట్టింటి దగ్గర ఉంటుందని తెలిసింది.ఇక ఈ విడాకుల గురించి మెగా ఫ్యామిలీ కూడా స్పందించలేదు.
నిజానికి పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు వచ్చాయి.పుట్టింటి వారు ఇచ్చిన ఫ్రీడంను అత్తింట్లో కూడా వాడుకోవడం వల్ల మధ్యలో రెండు సార్లు వార్తల్లో కూడా నిలిచింది.
అప్పటికే తన అలవాట్లను మార్చుకోమని అత్తింటి వాళ్ళు గట్టిగా హెచ్చరించినప్పటికీ కూడా మళ్లీ అదే విధంగా చేయడంతో ఇప్పుడు తన భర్త చైతన్య జొన్నలగడ్డ( Chaitanya Jonnalagadda ) దూరం పెట్టాడని తెలుస్తుంది.నిజానికి వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ప్రతిరోజు ఇద్దరు దిగిన ఫోటోలను కచ్చితంగా పంచుకునే వాళ్ళు.
కానీ కొన్ని రోజుల నుండి వీరు కలిసిన ఫోటోలు ఏవి రావట్లేవు.అంతేకాకుండా ఇద్దరు ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా అయ్యారు.

దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందరూ అభిప్రాయపడుతున్నారు.పైగా ఎప్పుడూ ప్రతి వివాదాన్ని తట్టి లేపే నాగబాబు మాత్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో నిజంగానే విడాకులు తీసుకున్నారని అనుమానాలు వస్తున్నాయి.నిహారిక కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించకపోగా.మళ్లీ ఇప్పుడు వరుస పోస్టులు షేర్ చేయడంతో లో లోపల ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది.

అయితే వీరి విడాకుల గురించి సరైన క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా నిహారిక రెండో పెళ్లి గురించి మాత్రం చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది.అదేంటంటే నాగబాబు తన కూతురికి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడని.అది కూడా తన మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తో ( Sai Dharam Tej ) నిహారికను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మామూలుగా గతంలోనే నిహారికను సాయి ధరమ్ తేజే పెళ్లి చేసుకోవాల్సి ఉండేది.

కానీ ఆయనకు నిహారిక పై అటువంటి ఉద్దేశం లేకపోవటంతో వెంటనే నాగబాబు చైతన్యతో పెళ్లి చేశాడు.ఇప్పుడు అది పెటాకులు కావడం వల్ల ఇప్పుడు మళ్లీ నాగబాబు తన మేనల్లుడు పై దృష్టి పెట్టాడని తెలుస్తుంది.ఇంత చేశాక బయట వ్యక్తులు పెళ్లి చేసుకోరని.అందుకే తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నాగబాబు అనుకున్నట్లు తెలిసింది.
అయితే ఇందులో ఎంత నిజాముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక కొంతమంది మాత్రం ఇదంతా ఫేక్ అని.ఎవరో కావాలని మెగావారిని టార్గెట్ చేస్తూ ఇలా పుకార్లు పుట్టిస్తున్నారు అని అంటున్నారు.మరి కొంతమంది మాత్రం ఇది నిజమే అని అనుకుంటున్నారు.
మరి వస్తున్న ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.







