అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో శ్రీధర్ అరెస్ట్ పై ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శ్రీధర్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు తెలిపారు.వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు వెలికితీస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇసుక దొంగల్ని వదిలి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
కొమ్మాలపాటి శ్రీధర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.