ఆర్ -5 జోన్పై ఏపీ హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లను విచారించేందుకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది.
ఆర్ -5 జోన్ కింద అమరావతిలోని సుమారు 1,134 ఎకరాలను సెంటు పట్టా కింద ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజధాని అవసరాలకు మినహా ఇతర పనులకు అమరావతి భూములను ఇవ్వొద్దని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు కోర్టు తీర్పునకు విరుద్ధంగా జీవో విడుదలపై రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.







