తెలంగాణ రాజకీయాల్లో సుకేశ్ లేఖ సంచనలంగా మారింది.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనల మేరకు బీఆర్ఎస్ కార్యాలయంలో సుకేశ్ ఎవరికీ డబ్బు ఇచ్చాడన్న వాదనలు చర్చనీయాంశంగా మారాయి.
మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సుకేశ్ రాసిన లేఖను ఆయన తరపు న్యాయవాది అనంత్ మాలిక్ బయటపెట్టారని తెలుస్తోంది.
వారం రోజుల్లో సుకేశ్ సంచలన విషయాలు చెబుతాడని న్యాయవాది చెబుతున్నారు.సుకేశ్ రాసిన లేఖలపై హైపవర్ కమిటీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సుకేశ్ ఇచ్చే చాటింగ్ ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇచ్చే అవకాశం ఉంది.కాగా 2015 నుంచి సుకేశ్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని న్యాయవాది వెల్లడించారు.