బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు( Vishnukumar Raju ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడిగా పోటీ చేయటం అన్నివార్యమని తెలిపారు.ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం పాలు కావటంపై అధిష్టానం అంతర్మధనం చేసుకోవాలని సూచించారు.
వైసీపీ, బీజేపీ( YCP , BJP ) ఒకటేనన్నే భావన ప్రజలలో ఉంది.ఈ రీతిగానే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ చాలా నష్టపోయే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రలోభాలు పెట్టినా గాని వైసీపీనీ ఆదరించకపోవడం బట్టి చూస్తే ప్రజలలో మార్పు కనిపిస్తుందని స్పష్టం చేశారు.ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ అక్కడ బీజేపీ అనుకూలంగా మార్చుకుంది.ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా పార్టీ ఎదుగుదలకు అధిష్టానం కృషి చేయాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టా బద్రుల ఎన్నికలలో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.జనసేనతో మిత్రపక్షంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న గాని… కమలం పార్టీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయల్లో సంచలనంగా మారాయి.