హైదరాబాద్ గన్పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారం కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో గన్పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంపై పోలీసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.