మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరోక్ష విమర్శలు చేశారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతోందని తెలిపారు.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని పొంగులేటికి సవాల్ విసిరారు.
దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించాలని చెప్పారు.పదవిలో ఉన్నప్పుడు ఏం చేయని వ్యక్తి కేసీఆర్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.







