ఈ మధ్య కాలంలో సాధారణంగా దేశంలోని ఆరు సంవత్సరాల లోపు పిల్లల్లో 67 శాతం మంది, మహిళలలో 57 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తోంది.
ఈ లోపం తగ్గడానికి ఎండుద్రాక్ష ఎంతో బాగా పనిచేస్తుంది.చిన్న పిల్లలలో, మహిళలలో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
మన దేశంలో ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలలో 67% మంది, మహిళలలో 57 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఎర్ర రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవడమే అని చెబుతున్నారు.
ఉత్పత్తి అయిన కొందరిలో త్వరగా క్షమించబోతున్నాయి అని కూడా చెబుతున్నారు.
రక్తం కోల్పోవడం దీనికి ముఖ్య కారణం.
చాలా మందిలో ఐరన్ లోపంతో రక్తహీనత సమస్య వస్తుంది.ఇది లోపిస్తే ఎర్ర రక్త కణాలు తగినంత ఉత్పత్తి కావు.
దీనివల్ల అలసట, ఆయాసం వంటి లక్షణాలు వస్తూ ఉంటాయి.ఐరన్ లోపం తగ్గడానికి ఎండు ద్రాక్ష ఎంతో బాగా పనిచేస్తుంది.
ఇందులో ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రాత్రిపూట పది నుంచి 15 ఎండు ద్రాక్ష నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తిని నీళ్లు త్రాగడం వల్ల ఐరన్ సమస్య దూరం అయిపోతుంది.ఫలితంగా రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది.ఎండు ద్రాక్ష అందాన్ని మెరుగుపరచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
దీనిలో ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే నల్ల ఎండుద్రాక్షలో ఐదు వృక్ష రసాయనాలు ఓలియానోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.ఇవి పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన పరిశోధనలలో తెలిసింది.
ముఖ్యంగా వీటిలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వలన మలవిసర్జన సాఫీగా అవుతుంది.అంతేకాకుండా ఇది మానవ శరీరానికి ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.







