ట్రాన్స్‎పోర్ట్‎లో రైల్వే కీలకపాత్ర.. కిషన్ రెడ్డి కామెంట్స్

పబ్లిక్, గూడ్స్ ట్రాన్స్‎పోర్ట్‎లో రైల్వేది కీలక పాత్ర అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రైల్వే సేవలను మారుమూల ప్రాంతాలకు తీసుకు వెళ్లాలనేది రైల్వేశాఖ లక్ష్యమని తెలిపారు.

 Key Role Of Railway In Transport.. Kishan Reddy Comments-TeluguStop.com

ఏపీలో మౌలిక వసతులకు రైల్వేశాఖ బడ్జెట్ లో రూ.8,406 కోట్లు కేటాయించినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ మేరకు విజయవాడ – హుగ్లీ ఎక్స్ ప్రెస్ నర్సాపురం వరకు, నంద్యాల – కడప ప్యాసింజర్ రేణిగుంట వరకు పొడిగింపు కానుందని పేర్కొన్నారు.అదేవిధంగా విశాఖ -విజయవాడ ఎక్స్ ప్రెస్ గుంటూరు వరకు విస్తరించనుందని తెలిపారు.

ఎయిర్ పోర్టుల తరహాలోనే విజయవాడ రైల్వేస్టేషన్ ను ఆధునీకరిస్తామని చెప్పారు.విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ అద్దాలతో స్పెషల్ ట్రైన్ నడుపుతామని, అంతేకాకుండా రాజమండ్రి రైల్వేస్టేషన్ ను ఆధునీకరించబోతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube