హైదరాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం కాగా బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాల్ కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ గత రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభించారు.
అయితే ఈ కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి హమీ ఇచ్చారు.మరోవైపు నిన్న రాత్రి కూడా డెక్కన్ మాల్ లో మంటలు చెలరేగాయి.
దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.